1. తెలుగుగంగ నీటి ప్రాజెక్టు ద్వారా ఏ నగరం నీటి సమస్య తీరుస్తున్నారు?
  1) బెంగళూరు 
  2) కొచ్చిన్
  3) హైదరాబాద్ 
  4) చెన్నై

సమాధానం: 4
2. కిందివాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టు ఏది?
  1) హీరాకుడ్ 
  2) గండక్
  3) రిహాండ్ 
  4) మయూరాక్షి


సమాధానం: 2
3. జపాన్ సహాయంతో పూర్తి చేసిన పైథాన్ (జయక్‌వాడీ) జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
  1) గంగ 
  2) గోదావరి
  3) నర్మద 
  4) కావేరి


సమాధానం: 2
4. భారతదేశంలోని నీటిపారుదల సౌకర్యాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 
  1) 4 
  2) 3 
  3) 2 
  4) 5



సమాధానం: 2
5.రుద్రమాత కాలువ ఏ రాష్ట్రంలో ఉంది?
  1) గుజరాత్
  2) బిహార్
  3) మహారాష్ట్ర 
  4) ఒడిశా


సమాధానం: 1
6. భారతదేశంలో ఏ ప్రాంతంలో చెరువులు ప్రధాన నీటిపారుదల వనరులుగా ఉన్నాయి?
  1) ఈశాన్య ప్రాంతం
  2) ఉత్తర భారతదేశం
  3) దక్కను పీఠభూమి
  4) హిమాలయ పర్వత శ్రేణి ప్రాంతాలు


సమాధానం: 3
7.భారతదేశంలో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది?
  1) ఉత్తరప్రదేశ్ 
  2) పంజాబ్
  3) మిజోరాం 
  4) రాజస్థాన్


సమాధానం: 2

8. కిందివాటిలో భారతదేశంలో చెరువుల ద్వారా ఎక్కువ నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది?
  1) రాజస్థాన్ 
  2) మధ్యప్రదేశ్
  3) తమిళనాడు 
  4) కేరళ


సమాధానం: 3
9. భారతదేశంలో అన్నింటి కంటే ఎక్కువగా నీటిపారుదల సౌకర్యాలు వేటి ద్వారా కల్పిస్తున్నారు?
  1) బావులు 
  2) కాలువలు
  3) చెరువులు 
  4) జీవ కాలువలు


సమాధానం: 1
10. భవాని రిజర్వాయర్ కాలువల వల్ల ఏ రాష్ట్రం ప్రయోజనం పొందుతోంది?
  1) కర్ణాటక 
  2) గుజరాత్
  3) పశ్చిమ బెంగాల్ 
  4) తమిళనాడు


సమాధానం: 4
11. తెహ్రీడ్యామ్‌ను ఏ నదిపై నిర్మించారు?
  1) యమున 
  2) భాగీరథి
  3) గంగా  
  4) బ్రహ్మపుత్ర


సమాధానం: 2
12.బెంగాల్ ప్రాంతంలో దామోదర్ లోయ కార్పొరేషన్ (DVC) ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
  1) 1951  
  2) 1953
  3) 1961  
  4) 1948


సమాధానం: 4
13. భారతదేశంలోని నీటిపారుదల ప్రాజెక్టులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు?
  1) 3 
  2) 4 
  3) 2 
  4) 5


సమాధానం: 1
14. మధ్య తరహా నీటిపారుదల పథకం అంటే ఏమిటి?
 1) 2000 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణానికి నీటి పారుదల కల్పించే పథకం
 2) 2000-10,000 హెక్టార్ల ఆయకట్టు ప్రాంతం ఉన్న పథకం
 3) 20,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్టు ఉన్న పథకం
 4) పైవేవీ కావు


సమాధానం: 2
15. ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
  1) 1990-91 
  2) 1972-73
  3) 1974-75 
  4) 2007-08


సమాధానం: 3
16. భాక్రానంగల్ ప్రాజెక్టు ద్వారా సుమారుగా ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సాధిస్తున్నారు?
  1) 4100  
  2) 1280
  3) 1100  
  4) 1204


సమాధానం: 4
17. ఇందిరాగాంధీ కెనాల్ ద్వారా ఏ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు?
  1) రాజస్థాన్ 
  2) గుజరాత్
  3) మధ్యప్రదేశ్ 
  4) ఉత్తరప్రదేశ్


సమాధానం: 1
18. బాగ్లీహార్ ప్రాజెక్టు విషయంలో ఏ రెండు దేశాల మధ్య వివాదం ఉంది?
  1) భారతదేశం - బంగ్లాదేశ్
  2) భారతదేశం - చైనా
  3) భారతదేశం - పాకిస్తాన్
  4) చైనా - నేపాల్


సమాధానం: 3

19. కిందివాటిలో 4801 మీటర్ల పొడవుతో భారత్‌లో అతి పొడవైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది ఏది?
  1) నాగార్జున సాగర్
  2) హీరాకుడ్
  3) భాక్రానంగల్
  4) బియాస్


సమాధానం: 2
20. నాగార్జునసాగర్ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు?
  1) గోదావరి 
  2) గంగా నది
  3) పెన్నా  
  4) కృష్ణానది


సమాధానం: 4
21. సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
  1) భాగీరథి 
  2) చంబల్
  3) నర్మద  
  4) తపతి


సమాధానం: 3
22. ఆలమట్టి ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
  1) కావేరి  
  2) కృష్ణా
  3) గోదావరి 
  4) మహానది


సమాధానం: 2
23. కిందివాటిలో పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానంలో రూపుదిద్దుకున్న ప్రాజెక్టు ఏది?
  1) నాగార్జున సాగర్
  2) దామోదర్ నదీ లోయ ప్రాజెక్టు
  3) భాక్రానంగల్
  4) హీరాకుడ్


సమాధానం: 1
24. హీరాకుడ్ ప్రాజెక్టును ఒడిశా రాష్ట్రంలో ఏ నదిపై నిర్మించారు?
  1) నర్మద  
  2) తపతి
  3) కృష్ణా  
  4) మహానది


సమాధానం: 4
25. {పపంచంలో రాతితో నిర్మించిన అతి పెద్ద ఆనకట్ట ఏది?
  1) భాక్రానంగల్ 
  2) హీరాకుడ్
  3) నాగార్జున సాగర్
  4) కోసి


సమాధానం: 3
26. రాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట ఏ పథకంలో ఒక భాగం?
  1) గండక్  
  2) చంబల్
  3) కోసీ  
  4) బియాస్


సమాధానం: 2
27. నేపాల్ సరిహద్దులోని హనుమాన్ నగర్ సమీపంలో నిర్మించిన ప్రాజెక్టు ఏది?
  1) గండక్  
  2) చంబల్
  3) బియాస్ 
  4) కోసి


సమాధానం: 4
28.గుజరాత్‌లో నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన వ్యక్తి?
  1) మేధాపాట్కర్
  2) సుందర్‌లాల్ బహుగుణ
  3) అన్నా హజారే 
  4) సత్యప్రకాశ్


సమాధానం: 1
29. ముల్లపెరియార్ డ్యామ్ సమస్య ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది?
  1) తమిళనాడు - ఆంధ్రప్రదేశ్
  2) తమిళనాడు - కేరళ
  3) తమిళనాడు - కర్ణాటక
  4) కేరళ - కర్ణాటక


సమాధానం: 2

30. ప్యాంగ్ డ్యామ్‌ను ఏ నదిపై నిర్మించారు?
  1) సట్లేజ్  
  2) రావి
  3) బియాస్ 
  4) జీలం


సమాధానం: 3
31. {పపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
  1) జూన్ 22 
  2) మార్చి 12
  3) జూన్ 12 
  4) మార్చి 22


సమాధానం: 4
32.జాతీయ జల విజ్ఞాన సంస్థ ఎక్కడ ఉంది?
  1) లక్నో  
  2) రూర్కీ
  3) వారణాసి 
  4) కోల్‌కతా


సమాధానం: 2
33. సెంట్రల్ వాటర్ కమిషన్‌ను ఎప్పుడు స్థాపించారు?
  1) 1945  
  2) 1979
  3) 1990  
  4) 2002


సమాధానం: 1
34. కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో నిర్మించారు?
  1) తూర్పు గోదావరి
  2) కర్నూలు 
  3) గుంటూరు
  4) పశ్చిమ గోదావరి


సమాధానం: 3
35. గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మించారు?
  1) పశ్చిమ గోదావరి
  2) కరీంనగర్ 
  3) గుంటూరు
  4) నిజామాబాద్


సమాధానం: 4
36. కిందివాటిలో ఏ ప్రాజెక్టు ద్వారా ఢిల్లీ నగరానికి 200 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు?
  1) రిహాండ్ 
  2) రామ్‌గంగా
  3) గండక్  
  4) భాక్రానంగల్


సమాధానం: 2
37. కిందివాటిలో ఏ ప్రాజెక్టును ‘శ్రీపాద సాగర్’ అని పిలుస్తున్నారు?
  1) పులిచింతల 
  2) శ్రీరాంసాగర్
  3) ఎల్లంపల్లి 
  4) ఇచ్చంపల్లి


సమాధానం: 3
38. సట్లేజ్ - యమున నదులను కలిపే కాలువ ఏ రాష్ట్రంలో ఉంది?
  1) పంజాబ్ 
  2) హర్యానా
  3) ఉత్తరప్రదేశ్ 
  4) గుజరాత్


సమాధానం: 1
39. నదుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
  1) పోమాలజీ 
  2) పోటమాలజీ
  3) హైటాలజీ 
  4) ఒరింటాలజీ


సమాధానం: 2
40. ఫరక్కా ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
  1) గండక్  
  2) దామోదర్
  3) మహానది 
  4) హుగ్లీ


సమాధానం: 4
41. కిందివాటిలో సరికాని జత ఏది?
  1) రిహాండీ ప్రాజెక్టు - ఉత్తరప్రదేశ్
  2) కుందా ప్రాజెక్టు - కర్ణాటక
  3) తావా ప్రాజెక్టు - మధ్యప్రదేశ్
  4) ఒరయు ప్రాజెక్టు - రాజస్థాన్


సమాధానం: 2

42. మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ఏయే రాష్ట్రాల మధ్య ఉంది?
  1) ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక
  2) కేరళ - ఆంధ్రప్రదేశ్
  3) ఒడిశా - ఆంధ్రప్రదేశ్
  4) ఆంధ్రప్రదేశ్ - ఛత్తీస్‌గఢ్


సమాధానం: 3
43.పాలార్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది?
  1) తమిళనాడు - కర్ణాటక
  2) తమిళనాడు - ఆంధ్రప్రదేశ్
  3) కర్ణాటక - కేరళ
  4) తమిళనాడు - కేరళ


సమాధానం: 2
44.మయూరాక్షి ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
  1) మయూరాక్షి 
  2) హుగ్లీ
  3) కువారీ  
  4) దామోదర్


సమాధానం: 1
45. సరస్సుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
  1) పోరుమాలజీ 
  2) లిమ్నాలజీ
  3) పెడాలజీ 
  4) ఏదీకాదు


సమాధానం: 2
46. ఉత్తర భారతదేశంలో కాలువల ద్వారా వ్యవసాయం అధికంగా జరగడానికి కారణం?
  1) రంధ్రాన్విత నేలలు
  2) భూగర్భంలో నీరు అధికంగా ఉండటం
  3) జీవనదులు కాలువలకు భూమికగా ఉండటం
  4) జనసాంద్రత అధికంగా ఉండటం


సమాధానం: 3
47. భారతదేశంలో ఏ ప్రాంతంలో నీటిపారుదల సాంద్రత తక్కువగా ఉంది?
  1) ఉత్తర భారతదేశం
  2) ఈశాన్య ప్రాంతం
  3) దక్కన్ పీఠభూమి
  4) డెల్టా ప్రాంతాలు


సమాధానం: 2
48. ‘మలంపూజ’ కాలువ ఏ రాష్ట్రానికి చెందింది?
  1) కేరళ  
  2) తమిళనాడు
  3) కర్ణాటక 
  4) మహారాష్ట్ర


సమాధానం: 1
49.భారతదేశంలో అత్యల్ప నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది?
  1) హర్యానా 
  2) పంజాబ్
  3) బిహార్  
  4) మిజోరాం


సమాధానం: 4

50. భారతదేశంలో బావుల ద్వారా అధికంగా నీటి పారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది?
  1) మధ్యప్రదేశ్ 
  2) మహారాష్ట్ర
  3) ఉత్తరప్రదేశ్ 
  4) పంజాబ్


సమాధానం: 3
51. ‘మెట్టూరు జల విద్యుత్ కేంద్రం’ ఏ నదిపై ఉంది?
  1) తుంగభద్ర 
  2) మహానది
  3) కావేరి  
  4) గోదావరి


సమాధానం: 3
52. కిందివాటిలో ‘దామోదర్ వ్యాలీ కార్పొరేషన్’ లో భాగాలైన ఆనకట్టలు ఏవి?
  1) తిలైయా 
  2) మైథాన్
  3) పంచట్ 
  4) పైవన్నీ


సమాధానం: 4
53. భారతదేశ జాతీయ నది?
  1) గోదావరి 
  2) గంగా
  3) కృష్ణా  
  4) నర్మద


సమాధానం: 2
54. భారతదేశంలో జాతీయ జల మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
  1) 1975  
  2) 1948
  3) 1951  
  4) 1990


సమాధానం: 4
55.దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు ఒక?
  1) జలవిద్యుత్
  2) నీటిపారుదల
  3) బహుళార్థ సాధక
  4) ఏదీకాదు


సమాధానం: 3
56.కింది వాటిలో ఏ జల విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్‌లో ఉంది?
  1) మయూరాక్షి 
  2) రిహాండ్
  3) కంగ్సబతి 
  4) హీరాకుడ్


సమాధానం: 2
57. అత్యధిక ప్రాజెక్టులను ఏ నదిపై నిర్మించారు?
  1) గోదావరి 
  2) గంగా
  3) నర్మద  
  4) కావేరి


సమాధానం: 3
58. భారతదేశంలో కెల్లా అత్యంత ఎత్తై ప్రాజెక్టు?
  1) నాథ్ ప్రాజెక్టు
  2) తెహ్రీ ప్రాజెక్టు
  3) నాగార్జున ప్రాజెక్టు
  4) హీరాకుడ్ ప్రాజెక్టు



సమాధానం: 2
59. కిందివాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టు?
  1) కోసి  
  2) చంబల్
  3) తెహ్రీడ్యామ్ 
  4) మయూరాక్షి


సమాధానం: 1
60. భారతదేశంలో ఎత్తైన వంతెన ఏది?
  1) సేవోక్ వంతెన
  2) నైని వంతెన
  3) చంబల్ వంతెన
  4) ఎల్లిస్ వంతెన


సమాధానం: 3
61. కింది వాటిని జతపర్చండి?
  జాబితా - I    జాబితా - II
  a) రిహింద్    i) కర్ణాటక
  b) సీలేరు    ii) తమిళనాడు
  c) మెట్టూరు   iii) ఆంధ్రప్రదేశ్
  d) ఆల్‌మట్టి    iv) ఉత్తరప్రదేశ్
  సరైన సమాధానం
  1) a-iv, b-iii, c-ii, d-i
  2) a-i, b-ii, c-iii, d-iv
  3) a-iv, b-iii, c-i, d-ii
  4) a-i, b-ii, c-iv, d-iii


సమాధానం: 1
62. భాక్రానంగల్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
  1) రావి  
  2) బియాస్
  3) సట్లేజ్  
  4) చినాబ్


సమాధానం: 3
63. కింది వాటిని జతపర్చండి?
  జాబితా - I
  a) సర్దార్ సరోవర్ డ్యాం
  b) దక్షిణ భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం
  c) తోడాలు
  d) రాగి
  జాబితా - II
  i) అనైముడి
  ii) అగ్నిగుండాల
  iii) నర్మదా
  iv) నీలగిరి
  
  1) a-iv, b-ii, c-i, d-iii
  2) a-ii, b-iii, c-iv, d-i
  3) a-iii, b-i, c-iv, d-ii
  4) a-i, b-iv, c-iii, d-ii


సమాధానం: 3